శ్రీవిద్య ఎందుకు

ఇతి ప్రస్తో భగవతః ప్రోవాచ మునిసత్తమః |
యది తుస్తో సి భగవాన్నిమే పామరజన్తవః ||

Tశ్రీవిద్య తంత్రము యొక్క ఉద్దేశం మరియు ఇతర తాంత్రిక పద్దతుల నుండి ఎలా విభిన్నమైనదో బ్రహ్మాండ పురాణంలో వివరించబడినది .అగస్త్య ముని మానవులు వారి కుటుంబ పరమైన జీవనంలో నిరంతరం ప్రాపంచిక మరియు భౌతిక అవసరాలు తీర్చుకొనే క్రమంలో ఆధ్యాత్మిక ప్రగతిని చూపలేకపోతున్నారని గమనించారు .కాబట్టి ఆయన కుటుంబ ఉన్నతికి కృషి చేస్తూనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించేటువంటి విద్యను ప్రసాదించమని హయగ్రీవుణ్ణి మార్గనిర్దేశము చేయమని కోరారు.

తస్మాదశేషాలోకానాం త్రిపుర ఆరాధనం |
వీణ న శ్తొ భోగా పవర్గౌమ్ తు యుగపాధ్యేన కుత్రచిత్ ||

ఒక వ్యక్తి కుటుంబానికి మార్గనిర్దేశం చేయుటకు లోతైన భక్తినైనా మీరాదేవి భక్తి వలె లేక ఆత్మ జ్ఞానాన్ని ,జ్ఞాన క్రియ అథవా కర్మ యోగ ద్వారా సాధించడానికి నిబద్దతనైనా కలిగివుండాలి . ఇది ఎందుచేతనంటే ముక్తి తీవ్రమైన భక్తి ,నిబద్దత సేవ మరియు జ్ఞానములను ఒకే మార్గం లో నడిపినప్పుడు మాత్రమే సాదించబడుతుంది,అది కుటుంబాన్ని నడిపే వ్యక్తి అనుసరించలేడు . శ్రీవిద్య కుండలిని తంత్రం యొక్క పై పెచ్చు .కుండలిని తంత్రం భక్తి ,క్రియ ,కర్మ మరియు జ్ఞాన యోగాలని ఏకం చేసి వాటి మధ్య దారిని తెస్తుంది అది భక్తిద్వారా ముక్తిని ఇస్తుంది.

ఒక శ్రీవిద్య గురువు పరమేశ్వరి త్రిపుర సుందరి లో ఏకత్వం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని సాధించడానికి శ్రీవిద్య పవిత్ర గ్రంథాలలో చెప్పిన విదంగా మహాత్మ్య ఖండ భక్తి కొరకు , చర్య ఖండ కర్మ కొరకు , క్రియ ఖండ సాధన కొరకు మరియు జ్ఞాన ఖండ జ్ఞానము కొరకు వివరించి ఉన్నవి,దీని ద్వారా శిష్యలను మార్గ నిర్దేశము చేస్తారు.భక్తి ఒకటే లేక ధ్యానము ఒకటే శ్రీవిద్య యొక్క మార్గము కాదు. శ్రీవిద్య మార్గము ఒక నిర్దిష్ట పురోగతి ,అది శ్రీవిద్య తంత్ర పద్ధతి ద్వారా సాధింపబడుతుంది.అనేక దేవతలు మరియు అభివృద్ధి స్థాయిలు కలిసి ఉంటాయి శ్రీవిద్య తంత్ర పద్దతిలో.

error: Content is protected !!