
Select Page
రూపాంతరంలో తొలి దశగా, స్థూల దేహాన్ని యోగ దేహంగా మార్చే సాధనల పై కేంద్రీకృతమై ఉంటుంది . ఆసనాలు, బంధాలు, ముద్రలు, ప్రాణాయామం, ధ్యానం, ధారణ వంటి సాధనల ద్వారా శరీరంలోని శక్తి ప్రవాహాలు శుద్ధి చేయబడి, భంగిమలో స్థిరత్వం, మనస్సుకు ఏకాగ్రత, శ్వాస నియంత్రణ ద్వారా యోగి లేదా యోగినిగా వ్యవహరించే క్రమశిక్షణ కలుగుతుంది.
తదుపరి దశలో యోగ దేహాన్ని సిద్ధ దేహంగా రూపాంతరం చెందుతుంది. నాడులు, చక్రాలు, కుండలిని శక్తి మరియు ఆధారాలపై కేంద్రీకృత సాధనల ద్వారా కుండలిని శక్తిని మేల్కొలిపి ఊర్ధ్వ గతిలో ప్రసరణ చేయిస్తారు. క్రిందకు ప్రవహించే శక్తి ఇప్పుడు పైకి మరలిపోతుంది, దీని ద్వారా సాధకునకు ఆలోచనలో పరిపక్వత కలుగుతుంది మరియు అభ్యాసకునికి సిద్ధులు లేదా విశేష నైపుణ్యాలు లభిస్తాయి.
తదుపరి దశలో సాధన ద్వారా సిద్ధ దేహాన్ని మంత్ర దేహంగా మార్చడం జరుగుతుంది. ప్రణవ యోగ, వ-సి యోగ, హంస యోగ వంటి మంత్ర సాధనలతో మానవ శరీరంలోని నిర్దిష్ట బిందువుల పై శక్తిని దృష్టి సారించటం ద్వారా శరీరంలో అసలైన శక్తీ సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నం చేస్తారు. ఇది అభ్యాసకునికి వివిధ కార్యాలను పూర్తి చేయగల సంపూర్ణ శక్తీ ని అందచేస్తుంది.
చివరి దశలో మంత్ర దేహాన్ని దివ్య దేహముగా రూపాంతరం చేయడం జరుగుతుంది. అంతర్గత ఆత్మ పై దృష్టి పెట్టి, జ్యోతి యోగ, బిందు యోగ, వ్యోమ యోగ, తురీయ యోగ వంటి సాధనలతో శుద్ధ చైతన్య రూపంలో నిజమైన ఆత్మజ్ఞానాన్ని అనుభవించేందుకు మార్గము సిద్ధమవుతుంది. ఈ జ్ఞానం ద్వారా అభ్యాసకుడు దైవిక స్వరూపాన్ని సంతరించుకుంటాడు.